ఏపీ రాజధాని అమరావతి ఇమేజ్ను పెంచేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిని ఎలివేట్ చేయడానికి అవసరమైన బ్రాండ్ అంబాసిడర్లను వివిధ దశల్లో నియమించాలని నిర్ణయించుకుంది. అంబాసిడర్గా ఎంపికైన వారికి ఏడాది పాటు టర్మ్గా నిర్ణయించారు. వివిధ రంగాల్లో నిపుణులు, రాజధాని ప్రాంతంలో ప్రజల్లో మమేకమైన వ్యక్తులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. నామినేషన్ ప్రాతిపదికన బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి కార్యాలయం నామినేట్ చేసిన వారిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.వచ్చిన నామినేషన్ల నుంచి వారి నైపుణ్యం, అర్హత, స్థాయిల ఆధారంగా ప్రభుత్వ అనుమతి తీసుకుని బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకోనున్నారు. ఒక ఏడాది కాలానికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకోనున్నారు. అంతర్జాతీయ స్థాయి నగరంగా అమరావతిని ప్రమోట్ చేసేలా బ్రాండ్ అంబాసిడర్లు కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వం పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa