ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొడుకును చంపిన తల్లి కేసు.. విచారణలో సంచలన విషయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 11:19 AM

ప్రకాశం జిల్లాలోని తెలుగు వీధిలో కొడుకును చంపిన తల్లి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొడుకు శ్యామ్ ప్రసాద్‌ను ఇద్దరు సోదరులు, మరో వ్యక్తి సాయంతో తల్లి లక్ష్మీదేవి హత్య చేయించినట్లు నిర్ధారించారు. శ్యామ్ మృతదేహాన్ని ముక్కలుగా నరికి గోనే సంచుల్లో కుక్కి మేదర వీధి సమీపంలో పడేశారు. మద్యానికి బానిసై సైకోగా ప్రవర్తిస్తున్న శ్యామ్‌ను తల్లి హత్య చేయించిందని పోలీసులు పేర్కొన్నారు. కాగా, శనివారం శ్యామ్ మృతదేహానికి పోస్టుమార్టం జరగనుంది.ఆటో డ్రైవర్ మోహన్తో కలిసి తల్లి సాలమ్మ ఈ దారుణానికి పాల్పడిందంటున్నాడు సుబ్రహ్మణ్యం పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు శ్యామ్ తల్లి సాలమ్మ, ఆటో డ్రైవర్ మోహన్ ను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆస్తి తగాదాలు, ఇతర కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.ఘటనా స్థలాన్ని మార్కాపురం డీఎస్పీ నాగరాజు పరిశీలించారు. మృతుడి శరీర భాగాలు దొరికిన ప్రాంతానికి వెళ్లి స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. తల్లి సాలమ్మ, ఆటో డ్రైవర్ మోహన్ తో పాటు శ్యామ్ అన్న సుబ్రహ్మణ్యాన్ని సైతం పోలీసులు ప్రశ్నించారు. పోలీసుల దర్యాప్తులో శ్యామ్ కుటుంబ సభ్యులు చెబుతున్న కారణాలు పొంతన లేకపోవడంతో లోతుగా విచారణ చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa