ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహాకుంభమేళాకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌

national |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 02:48 PM

మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక వందే భారత్‌ రైలును నడపనున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక రైలు (02252) న్యూ ఢిల్లీ నుంచి ఉదయం 5:30 గంటలకు బయలుదేరి 12 గంటలకు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటుంది. ఇక 2:20కి వారణాసి చేరుకుంటుందని నార్తర్న్‌ రైల్వేస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రైలు ఫిబ్రవరి 15,16,17 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది.వందే భారత్‌ ప్రత్యేక రైలు (02252) న్యూ ఢిల్లీ నుంచి ఉదయం 5:30 గంటలకు బయల్దేరుతుంది. 12 గంటలకు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటుంది. ఇక 2:20కి వారణాసి చేరుకుంటుంది అని నార్తర్న్‌ రైల్వేస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. తిరుగు ప్రయాణంలో 02251 నంబర్‌ గల స్పెషల్‌ వందే భారత్‌ రైలు వారణాసిలో 3:15కి బయల్దేరుతుందని పేర్కొంది. ఈ రైలు ప్రయాగ్‌రాజ్‌కు 17:20 (సాయంత్రం 5:20కి) చేరుకుంటుంది. ఇక రాత్రి 11:50కి అంతా ఢిల్లీ స్టేషన్‌కు చేరుకుంటుందని నార్తర్న్‌ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ హిమాన్షు శేఖర్‌ ఉపాధ్యాయ తెలిపారు. వారాంతంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.కాగా, మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని రైల్వే స్టేషన్లు యాత్రికులతో కిక్కిరిసిపోతున్నాయి. చాలా మంది రోడ్డు మార్గంలో వెళ్తుండటంతో ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. గత వారాంతం దాదాపు 300 కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో రద్దీని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఈ చర్యలు చేపట్టారు. సెమీ హైస్పీడ్‌ రైలు భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిచనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa