ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ మంత్రి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 03:48 PM

ఏపీ హోంశాఖ మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైబర్‌ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని, చిన్నారులపై అత్యాచారాలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. విజయవాడలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. న్యాయవాదులందరినీ ఒకచోట చేర్చి సదస్సు నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో మహిళలు ఎక్కువగా ఉండటం శుభపరిణామమన్నారు.
దొంగలు చాలా తెలివి మీరిపోయారు. ప్రతి వ్యక్తి తనకు తాను నిఘా పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు చాలా అవసరం. టెక్నాలజీని ఉపయోగించుకుని నేరాలను నియంత్రించాలి. ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. పోలీసు, న్యాయవ్యవస్థ సమన్వయంతో చాలా కేసులు ఛేదించొచ్చు. బాధితులకు అండగా నిలిచేందుకు మనమంతా ఏకమవుదాం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుదాం'' అని అనిత అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa