టెక్నాలజీని ఉపయోగించుకుని నేరాలను నియంత్రించాలని హోంమంత్రి అనిత సూచించారు. విజయవాడలో డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులపై అత్యాచారాలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు చాలా అవసరమని పేర్కొన్నారు.హోంమంత్రి ఇంకా మాట్లాడుతూ.. డిజిటల్ ఎవిడెన్స్పై సమన్వయం చేసుకుని పని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసు శాఖ, న్యాయ శాఖ మధ్య సమన్వయం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఒక గౌరవమైన వృత్తిలో న్యాయ వ్యవస్థ ఉందని.. పోలీసులు, లాయర్లను చూసి ఇప్పుడు గర్వపడుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో సైబర్ నేరాలు మరింత ఎక్కువగా జరుగుతాయని తెలిపారు. ‘‘ప్రస్తుతం దొంగలు.. మన కన్నా షార్ప్ గా ఉన్నారు. డిజిటల్ ఎవిడెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సైబర్ నేరాలు బాగా పెరుగుతున్నాయి. లాయర్లు, డాక్టర్లు, పోలీసులు కూడా సైబర్ క్రైంలో చిక్కుకున్నారు. ఈజీ మని కోసం జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. డిజిటల్ క్రైం, డిజిటల్ ఎవిడెన్స్పై అవగాహన ఉండాలి’’ అని చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa