ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22 నుంచి మే 25 వరకు టోర్నీ జరగనుంది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఐపీఎల్.. ఈ షెడ్యూల్ను విడుదల చేసింది. క్రితం సారి మాదిరిగానే ఈసారి కూడా లీగ్ దశలో 70 మ్యాచ్లు జరుగుతాయి. ఒక్కో జట్టు 14 మ్యాచ్లు ఆడుతుంది. లీగ్ దశ ముగిసే సరికి పాయింట్ల పట్టికలో టాప్-4 నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్కు చేరుకుంటాయి. మిగతావి నిష్క్రమిస్తాయి.
ఇక ఐపీఎల్లో పాల్గొనే జట్లు లీగ్ దశలో ఆడే 14 మ్యాచ్లలో ఏడింటిని హోం గ్రౌండ్లో ఆడేందుకు అవకాశం ఉంటుంది. సదరు ఫ్రాంఛైజీ కోరుకున్న చోట ఆ మ్యాచ్లను ఏర్పాటు చేస్తారు. ఉదాహారణకు సన్రైజర్స్ హైదరాబాద్ గురించే మాట్లాడదాం. హైదరాబాద్ హోంగ్రౌండ్ ఉప్పల్. దీంతో లీగ్ దశలో ఆ జట్టు ఆడే ఏడు మ్యాచ్లు ఇక్కడే జరుగుతాయి. మరో ఏడు మ్యాచ్లు ఇతర వేదికల్లో జరుగుతాయి.
అయితే ఐపీఎల్ 2025 షెడ్యూల్ మాత్రం తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ను నిరాశకు గురి చేసింది. అదేంటి? ఏమైంది? 7 మ్యాచ్లు ఇక్కడే జరుగుతున్నాయి కదా? ఎప్పుడైనా ఇంతేకదా? ఇందులో నిరాశ ఏముంది? అంటారా.. ఆగండాగండి అక్కడికే వస్తున్నాం. ఐపీఎల్లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నజట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్, ముంబై ఇండియన్స్ ముందంజలో ఉంటాయి. ఈ జట్లు ఎక్కడ తలపడ్డా.. స్టేడియాలకు ఫ్యాన్స్ పోటెత్తుతారు. విరాట్, ధోనీ, రోహిత్ను చూసేందుకు తరలివస్తారు. కానీ ఈసారి తెలుగు అభిమానులకు విరాట్, ధోనీల ఆటను ఉప్పల్లో చూసే అవకాశం లేదు.
ఎందుకంటే ఈ సారి సన్రజర్స్ హైదరాబాద్ ఉన్న గ్రూప్లో కాకుండా మరో గ్రూప్లో ఈ రెండు జట్లూ ఉన్నాయి. దీంతో వాటితో లీగ్ దశలో ఒక్కో మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంటుంది. అవి కూడా బెంగళూరు, చెన్నైలోనే షెడ్యూల్ అయ్యాయి. దీంతో లీగ్ దశ మ్యాచ్లలో విరాట్ కోహ్లీ, ధోనీని ఉప్పల్లో చూడటం కష్టమే. అయితే క్వాలిఫయర్-1 మ్యాచ్తో పాటు.. ఎలిమినేటర్ మ్యాచ్కు కూడా హైదరాబాద్లో జరగనుంది. సన్రైజర్స్తో పాటు ఆ రెండు జట్లు కూడా ప్లే ఆఫ్స్ చేరితే.. ఆరెంజీ ఆర్మీతో చెన్నై, బెంగళూరు మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa