ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతిలో వైభవంగా టెంపుల్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో- 2025

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2025, 10:22 AM

అంతర్జాతీయ ఆలయాల సదస్సు ఉత్సవంలా మొదలైంది. ఇంటర్నేషనల్‌ టెంపుల్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో- 2025 సందడితో తిరుపతి కళకళలాడింది. సోమవారం సాయంత్రం ప్రారంభ వేడుకకు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆరెస్సెస్‌ ప్రముఖులు, దేశంలోని ప్రసిద్ధ ఆలయాల నిర్వాహకులు, వివిధ రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఆశా కన్వెన్షన్‌లో మరో రెండు రోజుల పాటూ ఈ సదస్సులు కొనసాగుతాయి. సదస్సుకు అనుబంధంగా జరుగుతున్న ఆలయాల భద్రత, నిర్వహణకు ఉపకరించే పరికరాలు, భారతీయ సంప్రదాయ వస్త్ర, చిత్రాల ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది.ఇంటర్నేషనల్‌ టెంపుల్స్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో (ఐటీసీఎక్స్‌-2025)పేరిట టెంపుల్‌ కనెక్ట్స్‌ సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ ఆలయోత్సవానికి తిరుపతిలోని ఆశా కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికైంది. సోమవారం నాటి ప్రారంభ సభకు ముందు అతిథులకు స్వాగతం పలుకుతూ ముంబై నుంచి వచ్చిన సంప్రదాయ కళాకారుల ఆధ్యాత్మిక సంగీత విన్యాసాలు ఓ పవిత్ర వాతావరణంలోకి తీసుకెళ్లాయి. ఒక హాల్లో సభ, మరో హాల్లో వివిధ స్టాళ్లను ఏర్పాటుచేశారు. ఆలయ పరిశుభ్రత, భద్రత, ఆచార వ్యవహారాలకు సంబంధించిన వస్తువులను తయారుచేసే కంపెనీలు ఈ స్టాళ్లలో కనిపించాయి. 17 దేశాల్లోని 1581 దేవాలయాల నుంచి ప్రతినిధులు సదస్సులో భాగస్వామ్యం కానున్నట్టు నిర్వాహకులు చెప్పారు. అయితే 58 దేశాల నుంచి అదనంగా 685 దేవాలయాల ప్రతినిధులు హైబ్రిడ్‌ ఫార్మాట్‌లో పాల్గొంటారని చెప్పారు.11మందికి పైగా వక్తలు, 15 వర్క్‌షా్‌పలు, 60 ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌ అంతర్జాతీయ దేవాలయాల సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. శ్రీ వేంకటేశ్వర ఆలయానికి నిలయంగా ఉన్న తిరుపతి ఏటా లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తోందని, ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే మతపరమైన ప్రదేశాలలో ఒకటిగా మారుతోందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa