ఏలూరు జిల్లా నిడమర్రు మండలం బావాయిపాలేనికి చెందిన మజ్జి ఏసురాజు(26) హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే యువకుడి హత్యకు కారణమని తేల్చారు. తన భార్యతో ఏసురాజు కలిసి ఉండడాన్ని చూసిన ఆమె భర్త, తండ్రికి సమాచారమిచ్చాడు. అతడు మరొకడని వెంటపెట్టుకొని వచ్చి మెసేజులు పంపుతావా అని ఏసురాజు చేయిని నరికేశారు. తర్వాత అతడిని ఓ పంటకాలువలో పడేసి వెళ్లిపోయారు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఏసురాజు మృతి చెందినట్లు తెలిపారు.నిడమర్రు మండలానికి చెందిన ఓ వివాహితకు సమీప గ్రామానికి చెందిన యువకుడు ఏసు రాజుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమె భర్తకు వీరి ప్రేమ వ్యవహారం విషయం తెలిసి ఏసు రాజును, భార్యను సైతం హెచ్చరించాడు. ఎన్నోసార్లు హెచ్చరించినా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆమె ప్రియుడు ఏసు రాజును కలుస్తూనే ఉంది. దీనికి పరిష్కారం ఏంటి, ఏం చేయాలా అని వివాహిత భర్త సతమతమయ్యాడు. ఈ క్రమంలో ఉండి మండలంలోని ఓ గ్రామంలో శనివారం రాత్రి తన భార్యతో ఆమె ప్రియుడు ఏసురాజు ఉండటాన్ని గమనించాడు. ఏసు రాజును బంధించి తన తండ్రికి సమాచారం ఇచ్చాడు. వివాహిత మామ గణపవరానికి చెందిన మరో వ్యక్తితో కలిసి వచ్చాడు. వివాహితతో ప్రేమ వ్యవహారం, ఆపై సంబంధం పెట్టుకున్న ఏసురాజును బావాయిపాలెం తీసుకెళ్లారు. తన భార్యతో తరచుగా ఛాటింగ్ చేస్తూ, మెసేజ్లు పంపుతున్న ఏసురాజు కుడి చెయ్యిని సగానికి నరికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa