ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజుకొక దారిలో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2025, 10:26 AM

సైబర్‌  నేరగాళ్లు, నేరాల ప్రక్రియలో అమాయక కూలీల అకౌంట్లను వాడుకుంటున్నారు. సోమవారం ఇలాంటి ఘటనే విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌ ప్రాంతంలో వెలుగు చూసింది. వడ్డెర కాలనీకి చెందిన పీట్ల వెంకటేశ్వరరావు కూలి పని చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన డానియేల్‌, రాముతో ఆయనకు పరిచయం ఉంది. గత ఏడాది వన్‌టౌన్‌లోని బీబీఎస్‌ బ్యాంక్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేస్తే రూ.1,500 ఇస్తారని వెంకటేశ్వరరావుకు డానియేల్‌, రాము చెప్పారు. దీంతో వెంకటేశ్వరరావు అకౌంట్‌ ఓపెన్‌ చేశాడు. రూ.1,500 ఇవ్వడం తో పీట్ల దుర్గాభవాని, వేముల సుశీల, వేముల ఇసాక్‌లతో కూడా అకౌంట్లు ఓపెన్‌ చేయించారు. ఒకొక్కరికి రూ.1500 ఇచ్చారు. పాస్‌పుస్తకాలు, ఏటీఎం కార్డులు, చెక్‌బుక్‌లను వారి నుంచి తీసేసుకున్నారు. ఈనెల 10న మహారాష్ట్ర జలగాం వద్ద జరిగిన ఓ సైబర్‌ క్రైమ్‌ కేసుకు సంబంధించిన నోటీసులు పీట్ల వెంకటేశ్వరరావు, పీట్ల దుర్గాభవాని, వేముల సుశీల, ఇసాక్‌లకు అందాయి. అవి అర్థం కాక తెలిసిన వారికి చూపించారు. పోలీసు నోటీసు వచ్చిందని, వేరే అకౌంట్ల నుంచి నలుగురి అకౌంట్లకు సుమారు రూ. 17.50 లక్షలు జమ అయ్యాయని తేలింది. ఆ నగదు వీరి అకౌంట్లలో లేదు. చెక్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు డానియేల్‌, రాముకు ముందే అప్పగించడంతో వారిపై ఈ నలుగురు బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యా దు చేశారు. తాము రూ.1500 వస్తాయంటే అకౌంట్లు ఓపెన్‌ చేశామని, తమకు ఏమీ తెలియదని ఫిర్యా దులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa