ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూపీఎస్సీ సివిల్స్ దరఖాస్తుల గడువు మరోసారి పెంపు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2025, 08:13 PM

సివిల్ సర్వీసెస్ పరీక్ష దరఖాస్తుల గడువును యూపీఎస్సీ మరోసారి పొడిగించింది. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులు ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. జనవరి 22న మొదలైన దరఖాస్తుల ప్రక్రియ తొలుత ఫిబ్రవరి 11తో ముగియగా.. అధికారులు ఆ గడువును 18వ తేదీ వరకు పొడిగించారు. అది మంగళవారంతో ముగియగా.. ఫిబ్రవరి 21 వరకు మరోసారి పొడిగించారు. ఆ తర్వాత మైనారిటీ స్థితి, 10 తరగతి రోల్‌ నంబర్‌ వంటి వాటిల్లో తప్పులు ఉంటే మార్చుకోవచ్చని యూపీఎస్సీ తెలిపింది. అయితే ఓటీఆర్‌ ప్రొఫైల్‌లోని పేరు, పుట్టినతేదీ, తల్లిదండ్రుల పేర్లు, మొబైల్‌ నంబర్‌, ఈమెయిల్‌ ఐడీ కాలమ్స్‌లో మార్పులకు అవకాశం ఉండదని పేర్కొంది. పేరు మార్చుకున్నా లేదా మెట్రిక్యులేషన్‌/ఉన్నత విద్య సర్టిఫికెట్‌లోని పేరులో దోషం ఉన్న సందర్భాల్లో గెజిట్‌ నోటిఫికేషన్‌ సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి లేకుంటే.. ప్రిలిమ్స్‌ ఫలితాల తర్వాత ఆన్‌లైన్‌లో సమర్పించొచ్చని పేర్కొంది. అభ్యర్థి తన రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ లేదా ఈమెయిల్‌ ఐడీ యాక్సెస్‌ ను కోల్పోతే.. ఒకదాని ఆధారంగా మరో దాన్ని మార్చుకోవచ్చని తెలిపింది. రెండింటి యాక్సెస్‌ కోల్పోతే అవసరమైన మార్పుల కోసం కమిషన్‌కు అభ్యర్థన పెట్టుకోవాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa