ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లలకు మన పురాణాలు చెప్పాలి: మంత్రి లోకేశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 08:30 PM

 పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వొద్దని, మన పురాణాలు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శివుడి గురించి వారికి చెప్పాలని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అందరం కలిసి మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. 'ధూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలకు సాయం చేస్తున్నాం. టెక్నాలజీ ఆధారిత ఆధ్యాత్మిక సేవలను ఆదర్శంగా నిర్వహిస్తున్నాం.హారీపోర్టర్ కథల కంటే మన పురాణాల్లో ఉన్న కథలు ఇంకా బాగుంటాయని వివరించాలి. ఎవెంజర్స్ ఎండ్ గేం, క్యాప్టెన్ అమెరికా, అవతార్ సినిమాల కంటే.. మన శ్రీకృష్ణుడి లీలలు, మన శ్రీ రాముడి గొప్పతనం గురించి చెప్పాలి. అందరం కలిసి సంస్కృతిని కాపాడుకోవాలన్నారు.. వాట్సాప్ ద్వారా ఆలయాల సేవలు, డ్రోన్ నిఘా వంటి సాంకేతిక ఆధారిత కార్యక్రమాలతో మన ఆధ్యాత్మిక సంప్రదాయాలను కాపాడుతూ.. ఆలయాల పాలనా వ్యవస్థను ఆధునీకరించడంలో ఏపీ ప్రభుత్వం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు మంత్రి నారా లోకేష్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa