ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలాజీ సింగ్ కు టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేశ్ కుమార్ క్షమాపణ చెప్పారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 21, 2025, 08:13 PM

తిరుమలశ్రీవారిని దర్శించుకుని ఆలయం నుంచి వెలుపలికి వచ్చే సమయంలో టీటీడీ బోర్డు సభ్యుడు నరేశ్ కుమార్ ఓ ఉద్యోగిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. నరేశ్ కుమార్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టీటీడీ ఉద్యోగులు గత రెండ్రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో, నేడు ఉద్యోగ సంఘాలతో టీటీడీ ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్ పై బోర్డు సభ్యుడు నరేశ్ కుమార్ చేసిన దూషణల పట్ల ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఉద్యోగి బాలాజీ సింగ్ కు టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేశ్ కుమార్ క్షమాపణ చెప్పారు. నరేశ్ కుమార్ క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం ఇంతటితో ముగిసినట్టయింది.కాగా, ఈ వ్యవహారంపై టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్ స్పందిస్తూ తనకు ఎదురైన అనుభవం పట్ల మూడు రోజుల పాటు ఎంతో బాధపడ్డానని వెల్లడించారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa