ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భక్తుల శివనామస్మరణతో మారుమోగుతున్న శ్రీశైల పుణ్య క్షేత్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 11:56 AM

శ్రీశైల క్షేత్రానికి పాదయాత్ర అంటే జీవితంలోనే మరచిపోలేని మజిలీగా భక్తులు భావిస్తారు. మహాశివరాత్రి రోజుల్లో శివయ్యను దర్శించడానికి ఉత్సాహం చూపుతారు. కష్టతరమే అయినా ఉప్పొంగుతున్న భక్తితో శివనామస్మరణ చేసుకుంటూ ముందుకు సాగిపోతుంటారు. ఈ శివరాత్రి సందర్భంగా వేల సంఖ్యలో వస్తున్న వారి యాత్ర ఎలా సాగుతున్నదంటే.... స్వగ్రామాల నుంచే నడచి వస్తున్న వారు కొందరైతే, ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామానికి వాహనాల్లో కొంతమంది చేరుకుంటున్నారు. అక్కడి నుంచి పంటపొలాల గుండా నాగలూటి చెంచుగూడెం చేరుకుంటున్నారు. ఆతర్వాత 5 కిలోమీటర్లు అటవీ మార్గంలో ప్రయాణించి నాగలూటి వీరభ ద్రాలయాన్ని దర్శించి ముందుకు సాగుతున్నారు. నాగలూటి తిప్పలు, దామర్లకుంట, నల్లమల కొండలపై అడవిమార్గం గుండా సుమారు 14 కిలోమీటర్లు ప్రయాణించి పెచ్చెర్వు చెంచుగూడేన్ని చేరుకుంటున్నారు. ఆపై కత్తుల కొండ, కోర్కెలకొండ అటవీ ప్రాంతంలో 15 కిలోమీటర్లు నడిచి భీముని కొలను ప్రాంతానికి వస్తున్నారు. అక్కడి నుంచి ప్రమాదకర జారుడు కొండపై ప్రయాణించి కైలాస ద్వారానికి చేరుతున్నారు. 6 కిలోమీటర్లు దూరం ప్రయాణించి శ్రీశైల మల్లన్న దర్శనానికి తరలివెళ్తున్నారు...ఆదుకో శివయ్యా అంటూ అడుగు ముందుకు వేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa