ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యవసాయం అభివృద్ధి పట్ల చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 11:56 AM

రైతు సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖపట్నంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతులను పరామర్శించడం చట్టవ్యతిరేక కార్యక్రమంగా చిత్రీకరించడం దుర్మార్గం. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా వెళ్లకూడదని అంటున్నారు. అలాగైతే విజయవాడలో మ్యూజికల్‌ నైట్‌కు చంద్రబాబు ఎలా హాజరయ్యారో చెప్పాలి. జగన్మోహన్‌రెడ్డి గుంటూరు పర్యటన తరువాతే రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతుల సమస్యలపై దృష్టి పెట్టింది.చంద్రబాబుకు రైతు సమస్యల పట్ల, వ్యవసాయం అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు. షర్మిల పార్టీ విధానాలపై మాట్లాడితే స్పందిస్తాం. వ్యక్తిగత అజెండాలకు రాజకీయాల్లో తావు లేదు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా యూనివర్సిటీలకు వీసీలను నియమించారు. దానిని వైసీపీ ప్రశ్నించలేదు. గ్రూప్‌-2 రోస్టర్‌ పాయింట్‌ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం’ అని బొత్స అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa