ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యుద్ధం ఆగాలంటే జెలెన్ స్కీ, పుతిన్ కలవాలన్న ట్రంప్

international |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 02:33 PM

ఉక్రెయిన్-రష్యా యుద్ధం మూడేళ్లు దాటినా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ భారీగా నష్టపోయింది. ఎంతో అందంగా ఉండే ఉక్రెయిన్ శ్మశానాన్ని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆగిపోవాలంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. లక్షలాది మంది ప్రజల చావులు ఆగాలంటే వారు తప్పక కలిసి తీరాలని అన్నారు. తమతో ఉక్రెయిన్ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఖనిజ నిక్షేపాల్లో అమెరికాకు వాటా ఇచ్చేందుకు ఉక్రెయిన్ అంగీకారం తెలిపే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ కు అమెరికా భారీగా ఆయుధ, ఆర్థికసాయం అందించిందని తెలిపారు. బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉక్రెయిన్ కు అమెరికా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిందని చెప్పారు. ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్ తన వద్ద ఉన్న సహజ వనరులను అమెరికా కంపెనీలకు అందించాలని కోరారు. ఈ ఒప్పందానికి జెలెన్ స్కీ సానుకూలంగా స్పందించారని కూడా చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa