కడప జిల్లా, వాల్మీకిపురం మండలం వ్యాప్తంగా మహా శివ రాత్రి మహోత్సవాలకు ఆలయాలను ముస్తా బు చేస్తున్నారు. పట్టణానికి అత్యంత సమీపం లో ఉన్న వీరభద్రాద్రి (వీరన్నకొండ) పై వెల సిన శ్రీవీరభద్రస్వామి దేవాలయంలో మూడు రోజుల పాటుగా మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. 24న (సోమ వారం) కొండపై ప్రారంభమయ్యే వేడుకల్లో తొలిరోజు మహా నందీశ్వరుడి విగ్రహ ప్రతిష్ఠ, అభిషేకాలు, హోమాలు ఉంటాయన్నారు. 25 న ఆలయ శోభాలంకరణ, 26న వీరభద్రస్వా మికి అభిషేకాలు, హోమాలు, విశేష పూజలు జరగనున్నాయన్నారు. స్వామివారికి పూజలు, కొండపై తిరుణాల వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్నదాన ఏర్పాట్లు చేస్తున్నా రు. అలాగే పట్టణ పడమర పొలిమే రల్లోని ధర్మపథం ఆలయం, కోనేటివీఽ దిలో వెలసిన లక్ష్మీకామేశ్వరస్వామి దేవాలయాలలో శివరాత్రి రోజున అభిషేక పూజలు, శివపార్వతుల కల్యా ణోత్సవ వేడుకలకు ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తు న్నారు. ఈ ఏడాది వీరన్న కొండపై శివరాత్రి వేడు కలు ప్రత్యేకంగా నిలవనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa