వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని ప్రజల్లో తిరగకుండా చేసేందుకే భద్రత కుదించారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు. ఇల్లీగల్ యాక్టివిటీలకు భద్రత కల్పించలేమని చంద్రబాబు చెప్పడం దుర్మార్గమన్నారు.రైతులను పరామర్శించటం చంద్రబాబు దృష్టిలో ఇల్లీగల్ యాక్టివిటీయా..? అని ప్రశ్నించారు. మిర్చి రైతులను జగన్ పరామర్శిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్కు రాజకీయ విలువలు లేవా అని ప్రశ్నించారు. జగన్తో ఫొటో దిగిన చిన్నారిపై సోషల్ మీడియాలో టీడీపీ సైకోలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దీనిని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. అమ్మ ఒడి వస్తుందో... రాలేదో.. నారాయణ, చైతన్య స్కూళ్ల వద్ద అడిగినా చెబుతారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa