ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్యాయం చేస్తున్నారని ఆవేదనతో రైతు ఆత్మహత్యాయాత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 10:06 PM

నెల్లిమర్ల మండల రెవె న్యూ కార్యాలయం ఎదుట ఓ రైతు శుక్రవారం పురుగుల మం దు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. తన భూమిని ఆన్‌లైన్‌ చేయాలని దరఖాస్తు చేసి కొన్నేళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించకపోవడంతో చివరకు ఆత్మహత్యకు చే సుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పని పూర్తి కావాలంటే రూ. లక్షలు ఇవ్వాలనే వీఆర్వోతో డిమాండ్‌ చేయడంతోనే తానీ నిర్ణయం తీసుకున్నట్లు బాధితుడు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గుషిణి పంచాయతీ చనమల్లుపేట గ్రామానికి చెందిన రైతు చనమల్లు అబద్ధంకు అదే గ్రామంలో 126, 127, 131, 202 తదితర సర్వే నెంబర్లలో 1.60 ఎకరాల భూమి ఉంది. అందుకు సంబంధించిన పట్టాదారు పాస్‌ పుస్తకాలు కూడా ఉన్నాయి. అయితే ఆయన భూముల వివరాలేవీ ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. దాంతో భూమి అమ్మకానికి, రుణాల సదుపాయానికి వీలు కావడం లే దు. 2020 అక్టోబరు 15న తన భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు చేసి నాలుగేళ్లు పూర్తయినా పనికాలేదు. సదరు రైతుల భూమికి సంబంఽధించి ఎలాంటి వివాదాలు, అడ్డంకులు లేవని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa