స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా నియోజకవర్గంలోని ఆరు మండలాల అధికారులు పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖా మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ్వామి ఆదేశించారు. శుక్రవారం టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన రెవెన్యూ, హౌసింగ్, పంచాయతీరాజ్, వెలుగు, ఎన్ఆర్ఈజీఎ్స, ఎంపీడీవోలతోపాటు ఇతర శాఖల అధికారులతో విడివిడిగా సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఫ్రీహోల్డ్ ల్యాండ్స్ అక్రమాలు గుర్తించాలని స్వామి తహసీల్దార్లతో జరిగిన సమీక్షలో అన్నారు. రీసర్వే చేస్తున్న గ్రామాల్లో రీసర్వే తప్పులు లేకుండా పారదర్శకంగా, విమర్శలకు తావులేకుండా నిర్వహించాలని ఆరు మండలాల తహసీల్దార్లకు సూచించారు. ఎన్టీఆర్ హౌసింగ్లో పొజిషన్ సర్టిఫికెట్ల కోసం ఇచ్చిన అర్జీలను పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేయాలని చెప్పారు. పంచాయతీరాజ్ ఏఈలతో సమీక్షిస్తూ సీసీరోడ్లు, పల్లె పండుగ కార్యక్రమంలో నియోజకర్గంలోని వివిధ గ్రామాల్లో ప్రారంభమైన సీసీరోడ్లు, సైడు కాల్వల నిర్మాణ పనులపైనా, పంచాయతీరాజ్ శాఖలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపైనా సమీక్షించారు. సమీక్షలో ఆరు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa