ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ పాఠశాలల్లో ఎమ్మెల్యే ప్రచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 10:10 PM

కూటమి ప్రభు త్వం బలపర్చిన పాకలపాటి రఘవర్మకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కోరారు. శుక్రవా రం టీడీపీ కొమరాడ మండల కన్వీనర్‌ ఉదయశేఖరపాత్రుడు ఆధ్వ ర్యంలో పలు గ్రామాల్లో గల ప్రభుత్వ పాఠశాలల్లో ఆమె ప్రచారం చేశారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు మల్ల రామకృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. రఘువర్మను గెలిపించాలని ఎమ్మెల్యే జగదీ శ్వరి కోరారు. ఈ మేరకు ఆమె ఉల్లిభద్ర, గరుగుబిల్లి, రావుపల్లి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల కళాశాలల్లో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. అలానే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా రఘువర్మను గెలిపించాలని ఎన్నికల పరిశీలకుడు గురవాన నారాయణరావు, టీడీపీ పాలకొండ నియోజక వర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి కోరారు. ఈ మేరకు శుక్రవారం పాలకొండలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం పెద్దకాపువీధి హైస్కూల్‌లో ప్రచారం చేశారు. మాజీ జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఖండాపు వెంకటరమణమూర్తి, అరకు పార్లమెంట్‌ తెలు గు యువత అధ్యక్షుడు వారాడ సుమంత్‌నాయుడు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa