భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఫుల్ టెన్షన్. ప్రేక్షకులయితే టీవీలకు అతుక్కుపోయి మరీ కళ్లు ఆర్పకుండా మ్యాచ్ చూస్తూనే ఉంటారు. ఫ్యాన్స్లో ఎంత టెన్షన్ ఉంటుందో అంతకు పది రెట్ల ప్లేయర్లలో కూడా ఉంటుంది. అందులోనూ కెప్టెన్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఆ టెన్షన్ పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్లో స్పష్టంగా కనిపించింది.
మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ టెన్షన్తోనే ఉన్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ఆరంభం నుంచి వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ వచ్చింది. మ్యాచ్ ప్రారంభం కాగానే పాక్ కెప్టెన్ రిజ్వాన్ చేతిలో జపమాలతో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దానికి తగ్గట్టే మొదటి ఓవర్లో ఐదు వైడ్లు వచ్చాయి.
టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ ఐదు వైడ్లతో మొదటి ఓవర్ని ప్రారంభించాడు. ఆ ఓవర్లో ఆరు పరుగులు రాగా ఐదు పరుగులు వైడ్ల రూపంలోనే వచ్చాయి. కొత్త బంతి కావడం పిచ్ ఓవర్ స్వింగ్ అవుతుండటంతో అవుట్ సైడ్ ఆఫ్ వికెట్గా బంతి వెళ్లిపోయింది. దాంతో ఐదు బంతులు వైడ్లుగా వెళ్లాయి. మొత్తం మొదటి ఓవర్లో షమీ పదకొండు బంతులు విసరాల్సి వచ్చింది.
అయితే సోషల్ మీడియాలో మహమ్మద్ రిజ్వాన్ జపమాల పట్టుకున్న ఫొటోని నెటిజన్లు షేర్ చేశారు. రిజ్వాన్ ప్రేయర్ చేయడం మొదలుపెట్టగానే బంతి బ్యాట్కి తగలకుండానే రన్స్ వస్తున్నాయని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. డు ఆర్ డై మ్యాచ్లో పాకిస్తాన్ ప్లేయర్లపై చాలా ఒత్తిడి ఉంటుంది. ఫస్ట్ పవర్ ప్లే ముగిసే సమయానికి పాకిస్తాన్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హక్ 10, బాబర్ ఆజామ్ 23 పరుగులు చేసి అవుటయ్యారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఉండాలంటే పాకిస్తాన్కు ఇది కీలక మ్యాచ్. భారత్పై పాక్ ఓడితే దాదాపు ఇంటికి వెళ్లినట్లే. ఇప్పటికే న్యూజిలాండ్పై ఓడిపోయిన పాకిస్తాన్ జట్టుకు ఇది చావో రేవో మ్యాచ్. ఈ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్తో తలపడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa