ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెన్సిల్ మొనపై పరమశివుడి శివతాండవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2025, 08:42 PM

మహా శివరాత్రి సందర్భంగా భక్తులు భక్తి పారవశ్యంతో మునిగిపోతున్నారు. శైవక్షేత్రాలకు వెళ్లి పరమశివుడిని దర్శించుకుంటున్నారు. ఇక కళాకారులు తమ కళకు పని చెబుతున్నారు. ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మకళాకారుడు డాక్టర్‌ గట్టెం వెంకటేష్‌ ఆ మొననే బొమ్మగా మలిచారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని తాండవం చేస్తున్న శివుడి రూపాన్ని పెన్సిల్‌ మొనపై చెక్కారు. 8 మిల్లీమీటర్ల వెడల్పు, 18 మిల్లీమీటర్ల ఎత్తున్న ఈ సూక్ష్మ శిల్పాన్ని చెక్కేందుకు 10 గంటలు పట్టిందని వెంకటేష్‌ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa