ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాశ్మీర్‌లో రెచ్చిపోయిన టెర్రరిస్ట్‌లు,,,ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి

national |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2025, 09:01 PM

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. సైనికులు వెళ్తున్న వాహనంపై కాల్పులకు తెగబడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో సుందర్‌బానీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో నక్కి ఉన్న ఉగ్రవాదులు.. ఆర్మీ వాహనంపై విచక్షణ రహితంగా కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన సైనికులు.. వారిపై ఎదురు కాల్పులకు దిగారు. సైనిక వాహనంపై ఉగ్రవాదులు 3 నుంచి 4 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల ఘటనతో అప్రమత్తమైన సైన్యం.. ఆ ప్రాంతం మొత్తాన్ని అధీనంలోకి తీసుకుంది. ఉగ్రవాదుల జాడ కనుగొనేందుకు ఈ అటవీ ప్రాంతం మొత్తం గాలింపు చేపడుతున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా లేక చనిపోయారా అనేది ఇంకా అధికారులు ధృవీకరించలేదు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa