హాస్టళ్లో ఉండి చదువుకుంటోందో పదో తరగతి విద్యార్థి. అందరితోపాటే వాళ్లే పరీక్ష బోర్డు పరీక్ష కూడా రాసొచ్చింది. ఆపై వసతి గృహానికి వచ్చిన గంట సేపటికే ఆమె ప్రసవించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది, ఉపాధ్యాయులు షాక్ అయ్యారు. అసలు గర్భం దాల్చినట్లు కూడా కనిపించని అమ్మాయికి.. బిడ్డ పుట్టడం ఏంటని షాక్ అవుతున్నారు. ఈక్రమంలోనే ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలీ ఘటన ఎక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాలోని వసతి గృహంలో ఉంటున్న 10వ తరగతి విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చింది. ఉదయం పదో తరగతి పరీక్ష రాసి వచ్చి సాయంత్రం ప్రసవించింది. తీవ్ర నొప్పులతో విద్యార్థిని అల్లాడిపోగా, అసలు విషయం తెలియని హాస్టల్ సిబ్బంది వెంటనే విద్యార్థిని తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వారి ఫోన్ కాల్తో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు హుటాహుటినా వసతి గృహానికి చేరుకున్నారు. అయితే అప్పటికే విద్యార్థిని ప్రసవించగా అది చూసి తల్లిదండ్రులు నిర్ఘాంత పోయారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక చిత్రకొండ పోలీసులు సదరు వసతి గృహానికి వెళ్లి తల్లి బిడ్డలను దగ్గర్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోలీసులు, తల్లిదండ్రులు విద్యార్థిని గర్భధారణపై సదరు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిని ప్రశ్నించగా.. తనకేం సంబంధం లేదని, హాస్టల్ వార్డెన్దే బాధ్యత అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఎనిమిది నెలలుగా విద్యార్థిని గర్భవతిగా ఉన్నప్పటికీ అటు పాఠశాలలో గానీ, ఇటు హాస్టల్లో గానీ ఎవరికీ ఈ విషయం తెలియకపోవడం ఇక్కడ జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోయింది.
హాస్టల్ వార్డెన్ ఎప్పటికప్పుడు విద్యార్థులను పర్యవేక్షించడం, రూములు తనిఖీ చేయడం లాంటివి చేస్తున్నా విద్యార్థిని గర్భధారణ గురించి తెలుసుకోకపోవడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. విద్యార్థిని గర్భధారణ ఎలా కలిగింది, దీనికి ఎవరు బాధ్యులు అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఈ విషయంపై సదరు విద్యార్థిని తల్లిదండ్రులకు కానీ, పోలీసులకు కానీ సహకరించకపోవడం వల్ల అసలు విషయం తెలుసుకోవడం కష్టంగా మారినట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థిని విషయంపై నిర్లక్ష్యంగా ఉన్న పాఠశాల, హాస్టల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా సంక్షేమ అధికారి దర్యాప్తు అనంతరం నిందితుడు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa