ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన పయ్యావుల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 28, 2025, 11:39 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కుదేలైందని అన్నారు. వచ్చిన పరిశ్రమలను, రాబోయే పెట్టుబడను రానివ్వకుండా చేశారని మండిపడ్డారు. వైసీపీ పాలన చూసిన ప్రజలు 2024లో అపూర్వమైన తీర్పును ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని తెలిపారు. ఆ సవాళ్లను అధిగమించడంలో చంద్రబాబు ఆయననకు ఆయనే సాటి అని కొనియాడారు. 2019లో వచ్చిన ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకట్ట వేసి ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని స్థతికి తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. రూ.3.22 లక్షల కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్‌ను రూపొందించామని అన్నారు. రెవన్యూ వ్యయం అంచనా రూ.2,51,162 కోట్లు అని తెలిపారు. అదేవిధంగా మూలధనం అంచనా రూ.40,635 కోట్లు అని సభలో వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa