ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. మోదీ అక్కడకు వెళ్లొచ్చిన మరుసటి రోజే యూఎస్ సర్కారు అక్రమ వలసదారులను తిరిగి ఇండియాకు పంపించింది. ట్రంప్, మోదీ భేటీ తర్వాత సంకెళ్లు వేసి మరీ భారత పౌరులను పంపించడంతో.. తమిళ వెబ్సైట్ వికటన్ దీనిపై ఓ వివాదాస్పద కార్టూన్ వేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే సదరు వెబ్సైట్ను బ్లాక్ చేసింది. ఈ విషయం గుర్తించిన సంస్థ తాజాగా దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధం అయింది. ఎలాగైనా సరే తమ సంస్థను తిరిగి పునరుద్ధరించుకోవాలని పెద్ద ఎత్తునే ప్రయత్నాలు చేస్తోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ ట్రంప్తో ఓ భేటీలో పాల్గొని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఆయన అక్కడి నుంచి ఇండియాకు వచ్చేకంటే ముందే యూఎస్ సర్కారు అక్రమ వలసదారులు అయిన భారత పౌరులను తిరిగి స్వదేశానికి పంపించింది. అయితే ఆ సమయంలో వారందరి చేతులకు సంకెళ్లు వేసి నిందితులుగా ఇళ్లకు చేర్చడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈక్రమంలోనే తమిళ వెబ్సైట్ వికటన్.. ఓ వివాదాస్పద కార్టూన్ వేసింది.
ముఖ్యంగా ట్రంప్, మోదీ భేటీలో పాల్గొన్నట్లుగానే ఆ కార్టూన్ ఉండగా.. అందులో ట్రంప్ ప్రధాని చేతులకు సంకెళ్లు వేసి నవ్వుతున్నట్లు కనిపించారు. అలాగే మోదీ ముఖం మాడ్చుకుని.. అమెరికా అధ్యక్షుడి వైపు కోపంగా చూస్తున్నట్లు ఉంది. ఈ కార్టూన్ను వికటన్ వెబ్సైట్ ఫిబ్రవరి 10వ తేదీన పబ్లిష్ చేసింది. అయితే 15వ తేదీ నుంచి ఈ వెబ్సైట్ అందుబాటులో లేకుండా పోయింది. దీంతో ఏమైందో సదరు సంస్థ ఏమైందో తెలుసుకునే పనిలో పడగా.. కేంద్ర ప్రభుత్వమే ఆ వెబ్సైట్ను బ్లాక్ చేసినట్లు గుర్తించింది. ఈక్రమంలోనే ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
కేంద్ర సమాచార, ప్రసార శాఖ కావాలనే తమ వెబ్సైట్ను బ్లాక్ చేసినట్లు వివరిస్తూనే.. అనేక ఆరోపణలు చేసింది. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వెబ్సైట్ను బ్లాక్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈక్రమంలోనే వికటన్ సంస్థ న్యాయపరంగా ముందుకు వెళ్లింది. అయితే ఫిబ్రవరి 20వ తేదీ రోజు దీనిపై విచారణ చేపట్టగా.. భావ ప్రకటనా స్వేచ్ఛతోనే ఈ కార్టూన్ వేసినట్లు వెల్లడించింది. అయతే ఫిబ్రవరి 25వ తేదీన మాత్రమే కేంద్ర సమాచారం, ప్రసారశాఖ నుంచి అధికారికంగా ఆదేశాలు అందాయని వికటన్ వివరించింది. ఎలాగైనా సరే ఆ వెబ్సైట్ను పునరుద్ధరించాలని కోరింది. చూడాలి మరి మున్ముందు జరగనున్న న్యాయ పోరాటంలో ఎవరు గెలవనున్నారనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa