ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆమ్మో... ఎలుగుబంటి, భయాందోళనలో ప్రజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 09:20 AM

రాయదుర్గం పట్టణ శివారులోని రాజీవ్‌గాంధీ కాలనీ వద్ద రోడ్డుపై రెండ్రోజులుగా ఎలుగుబంటి హల్‌చల్‌ చేస్తోంది. శనివారం రాత్రి ద్విచక్రవాహనదారులకు ఎలుగుబంటి కనిపించడంతో భయాందోళన చెందారు. సమీపంలో వున్న కురాకుల గుట్ట నుంచి వచ్చి రోడ్డు మీద సంచరిస్తున్నట్లు కాలనీవాసులు చెబుతున్నారు. ఆదివారం పగలే రోడ్డుపైకి రావడంతో పరిసర ప్రాంత ప్రజలు పరుగులు పెట్టారు. అరగంటపాటు రోడ్డుపై సంచరించిన ఎలుగుబంటి తర్వాత గుట్టల్లోకి వెళ్లిపోయినట్లు కాలనీవాసులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు కొండ ప్రాంతాన్ని పరిశీలించి, కాలనీ వాసులకు పలు సూచనలు ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa