ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకేపాటి కి హైకోర్టు ఊరట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 04, 2025, 10:06 AM

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మందపల్లె గ్రామం పరిధిలోని వివిధ సర్వే నంబర్లలో వైసీపీ రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల అధీనంలో ఉన్న ప్రభుత్వ భూముల విషయంలో నాలుగు వారాలపాటు యథాతథ స్థితి పాటించాలని హైకోర్టు రెవెన్యూ శాఖతో పాటు పిటిషనర్లకు కూడా స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రెవెన్యూ ఉన్నతాధికారులను ఆదేశించింది. విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులిచ్చారు. మందపల్లె పరిధిలో వివిధ సర్వే నంబర్లలో ఉన్న మొత్తం 19.5 ఎకరాలకు సంబంధించి వెబ్‌ల్యాండ్‌లో తమ పేర్లను తొలగించి వాటిని స్వాధీనం చేసుకోవాలని, ఆ భూములకు సంబంధించి సేల్‌ డీడ్‌లను రద్దు చేయాలని రాజంపేట తహశీల్దార్‌ను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశించడాన్ని సవాల్‌ చేస్తూ ఆకేపాటి, ఆయన భార్య ఆకేపాటి జ్యోతి, సోదరుడు ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి ఆకేపాటి సుజన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున న్యాయవాది దిలీప్‌ వాదనలు వినిపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa