నరసన్నపేట మండలం బొంతలవీధికి చెందిన కేవీటీ గన్నెమ్మ(85) హత్యకు గురైంది. రోజూ ఈమె సత్యనారాయణ నగర్, కామేశ్వరి నగర్లో చెట్లకు ఉన్న పూలు ఏరి ఆలయాల వద్ద భక్తులకు ఇచ్చేది. వారు ఇచ్చిన డబ్బులతో కుమారుడి వద్ద ఉంటూ జీవనం సాగించేది. అలా ఈ ప్రాంతంలో పువ్వుల అవ్వగా పేరొందింది. కాగా రోజూ మాదిరి సోమవారం వేకువజామున 3 గంటలకు పువ్వుల కోసం ఆమె బయటకు వెళ్లింది. ఆ సమయంలో గంజాయి మత్తులో ఉన్న ఓ ఆగంతుకుడు.. ఆమె ముక్కులో ఉన్న బేషర్లు (బంగారం ఆభరణాలు) తస్కరించేందుకు ప్రయత్నించాడు. ఆమె మెడపై చేయి వేసి.. నోరును మూసేసి సత్యనారాయణస్వామి ఆలయంవైపు తీసుకెళ్లాడు. అక్కడ ముక్కులోని బంగారు ఆభరణాలను తస్కరించాడు. ఆ సమయంలో ఏమి చేశాడో.. కానీ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమెను ఈడ్చుకుంటూ వెళ్లి.. వివస్త్రగా చేసి కామేశ్వరినగర్కు వెళ్లే మార్గంలో మృతదేహాన్ని పడేశాడు. సోమవారం ఉదయాన్ని స్థానికులు ఆ వృద్ధురాలి మృతదేహాన్ని చూసి ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందు గుర్తుతెలియని మృతదేహంగా అనుమానించారు. ముక్కు భాగం వద్ద రక్తం కారడంతో బంగారం ఆభరణాలు కోసం హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. సమీపంలో ఇళ్లను వాకబు చేశారు. ఈ క్రమంలో వేకువజామున వెళ్లిన తన తల్లి.. ఉదయమైనా ఇంటికి రాలేదని బొంతలవీధికి చెందిన కేవీటీ సూర్యనారాయణ చెప్పారు. సంఘటన ప్రాంతానికి చేరుకుని ఆ మృతదేహం తన తల్లిదిగా గుర్తించి విలపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa