రాజమండ్రి పుష్కర ఘాట్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. పుష్కర ఘాట్ గోదావరి నది మధ్యలో బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు చెవల అన్నవరం, గాడా రాజు మృతి చెందారు. మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు., వివరాల్లోకి వెళితే.. గోదావరి నది మధ్యలో ఉన్న బ్రిడ్జి లంకకు12 మంది పడవలో వెళ్లారు. రాత్రి సమయంలో పడవలో తిరిగి వస్తుందగా రెండు వంతెనల మథ్యలో పడవలోకి నీరు చేరింది. దీంతో పడవ మునిగిపోయింది.పడవలో ఉన్న ఇద్దరు నీటిలో మునిగిపోగా.. 10 మంది ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. లంకల్లోకి నాటుపడవల్లో మందు పార్టీలకు వెళుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఎటువంటి భద్రత ప్రమాణాలు లేకుండా మత్స్యకారులు 24 గంటల పాటు గోదావరిలో నాటుపడవలు నడుపుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు గోదావరి తీరంలో ఉన్న లంక గ్రామాలు అడ్డాగా మారాయి.రాజమండ్రి పుష్కర ఘాట్లో మునిగిపోయిన నాటుపడవను బయటకు తీసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నీటిలో ఊబిలో నాటుపడవ కూరుకుపోయింది. వారిలో బోటు నడిపే మత్స్యకారుడు కూడా ఉన్నాడు. నాటుపడవలో వారు రాజమండ్రి శివారు సింహాచల్ నగర్, భవానీ పురం ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa