బడ్జెట్ కేటాయింపు లో కర్నూలుకు తీవ్ర అన్యాయం జరిగిందని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసన్న ఆరోపించారు. సోమవారం ఎమ్మిగనూరు పట్టణంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో కేంద్రం రాషా్ట్రనికి మొండిచేయి చూపింద న్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. పశ్చిమ ప్రాంతంలో ఉన్న వేదవతి, గుండ్రే వుల ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలు వలసలకు పోతున్న నివారించలేకపో యా రన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని అన్నారు. సమావేశంలో ఐఎఫ్టీయూ నాయకులు కే అనిఫ్, భారత రైతు కూలీ సంఘం నాయకులు ఏసేపు, జయన్న పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa