వైసీపీ అధ్యక్షుడు జగనమోహన రెడ్డికి పదవులపై ఉన్న వ్యామోహం ప్రజా శ్రేయస్సుపై లేదని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పురుషోత్తమ రెడ్డి విమర్శించారు. సోమవారం కౌతాళంలో పార్టీ మండల అధ్యక్షుడు యంకన్న అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజల నమ్మకాన్ని కాపాడుకుంటామ న్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన మోహనరెడ్డి అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హో దా కోరడం సిగ్గు చేటన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు రాషా్ట్రన్ని మూడు రాజదానులు అంటూ ముక్కలు చేశాడని, జగనను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. మండలానికి త్వరలో 100 పడకల ఆసుపత్రికి మంజూరు చేయించి ప్రజలకు మెరుగైన వైద్యం అందజేస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. సమా వేశంలో కోసిగి మండల అధ్యక్షుడు రాముడు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa