హస్తకళలకు ప్రసిద్ధి చెందిన ఏటికొప్పాక లక్కబొమ్మల కాలనీని సోమవారం జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సందర్శించారు. ఈ సందర్భంగా బొమ్మల తయారీని పరిశీలించారు. పలువురు హస్తకళాకారుల ఇళ్లకు వెళ్లి లక్కబొమ్మల తయారీకి వినియోగించే ముడి సరకులు, ఉపయోగించే రంగుల గురించి అడిగారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ప్రధాన ముడిసరకు అయిన అంకుడు కర్ర కొరతగా వుందని, అంకుడు చెట్లసాగును పెంచి అటవీ శాఖ ద్వారా అంకుడు కర్రను అందించాలని జాతీయ అవార్డు గ్రహీతలు ఎస్.చిన్నయాచారి, గొర్స సంతోశ్ కోరారు. బ్యాంకుల నుంచి రుణసదుపాయం కల్పించాలని, నైపుణ్య శిక్షణ అందించాలని కళాకారులు విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఏటికొప్పాక లక్కబొమ్మల స్టాల్ ఏర్పాటు చేయనుండడం అభినందనీయమన్నారు. అంతర్జాతీయంగా పోటీని ఎదుర్కొనేలా కొత్త డిజైన్ల రూపకల్పనకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయిస్తామని ఆమె భరోసా ఇచ్చారు. కలెక్టర్ వెంట డీర్డీఏ పీడీ శచీదేవి, తహసీల్దారు వరహాలు, ఇతర అధికారులు వున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa