ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రయత్నిస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 04, 2025, 03:54 PM

సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఓ మూర్ఖ శిఖామణి అని టీడీపీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఎదుటివారి కుటుంబ సభ్యుల గురించి, వారి ఆడబిడ్డల గురించి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని చెప్పారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిని కఠినంగా శిక్షించాలని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని బుచ్చయ్య చౌదరి అన్నారు. జగన్ సర్కార్ చేసిన రూ. 43 వేల కోట్లు అప్పులను తమ ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఏపీ బడ్జెట్ రూ. 3 లక్షల మార్క్ ను దాటిందని... ఆ ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని అన్నారు. ఈసారి బడ్జెట్ లో అన్ని రంగాలకు తగిన ప్రాధాన్యతను ఇచ్చినట్టు తెలిపారు. వ్యవసాయ, సంక్షేమ, అభివృద్ధి, పారిశ్రామిక, సేవా రంగాలకు గత ప్రభుత్వం కంటే ఎక్కువ నిధులు కేటాయించినట్టు తెలిపారు. వైసీపీ హయాంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, తమ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి 20 వేల కిలోమీటర్ల రోడ్లను బాగుచేసిందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa