ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోసానికి పది రోజుల రిమాండ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 04, 2025, 03:55 PM

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేట కోర్టు పది రోజుల రిమాండ్ విధించింది. పోసానిని ఇటీవల హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న రాయచోటి పోలీసులు అతనిని ఏపీకి తరలించారు. మరోవైపు... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ నేత కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన నరసరావుపేట పోలీసులు నిన్న పీటీ వారెంట్ పై పోసానిని అదుపులోకి తీసుకున్నారు.పోసానిని నిన్న సాయంత్రం నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో పోసానిని గుంటూరు జైలుకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోసానిపై 17 కేసులు నమోదయ్యాయి. ఓబులవారిపల్లిలో నమోదైన కేసులో రాజంపేట జైలులో ఉన్న పోసానిపై ఉన్నతాధికారుల అనుమతితో పల్నాడు జిల్లా నరసరావుపేట టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నరసరావుపేట పోలీసులకు అప్పగించే ముందు పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa