రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల ప్రధాన సమస్యలను పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ జీరో అవర్లో ప్రస్తావించారు. ప్రాధాన్యతా ప్రాతిపదికన వాటిని పరిష్కరించాలని మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ వెంటనే సెరీ కల్చర్ ప్రోత్సాహకాలను పునరుద్ధరించాలని కోరారు. ‘అనంతపురంలో తాగునీటి సమస్య పెరిగింది. రాప్తాడు నియోజకవర్గంలో 36 గ్రామ పంచాయతీల్లో సమస్య తీవ్రంగా ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలి’ అని ఎమ్మెల్యే పరిటాల సునీత కోరారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయన(ఆర్వీఎ్సకేకే రంగారావు) మాట్లాడుతూ, ‘విశాఖపట్నం- రాయగఢ్ రహదారి మధ్యలో రెండు చోట్ల అధ్వానంగా మారింది. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలి’ అని కోరారు. గౌతు శిరీష రహదారుల దుస్థితిని ప్రస్తావించారు. రోడ్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీచేసే ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు జిల్లా కేంద్రంలో మాత్రమే ఏర్పాటు చేయడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని బెందాళం అశోక్ కోరారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని శ్రీరామ్ రాజగోపాల్ కోరారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏసీబీ ఫోన్ నంబర్లు ప్రదర్శించాలని విజ్ఞప్తి చేశారు. ఆటోవాలాలను ఇబ్బంది పెడుతున్న జీవో 8 రద్దు చేయాలని ఎమ్మెల్యే బొండా ఉమ కోరారు. గాజువాకలో స్టీల్ ప్లాంట్ కేటాయించినప్పుడు ఇచ్చిన ప్లాట్లపై తిరిగి సర్వే చేసి, సమగ్ర డేటా ఆన్లైన్లో ఉంచాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కోరారు. గృహ నిర్మాణ పథకంలో గతంలో ఇళ్లు కేటాయించినా కట్టుకోని లబ్ధిదారులకు కొత్త పథకం వర్తింపజేయాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కోరారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, ‘నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa