అహంకారానికి ప్యాంటు, షర్టు వేస్తే జగన్రెడ్డిలా ఉంటుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. జగన్ బాగా ఫ్రస్ర్టేషన్లో ఉన్నారని, అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, అవినీతితో అడ్డగోలుగా వ్యవహరించి, ప్రతిపక్షంలోకి రాగానే నీతులు, విలువల గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. బుధవారం వెలగపూడి అసెంబ్లీ మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. ‘ఎన్నికలకు ముందు వైనాట్ 175 అని పదే పదే చెప్పిన వ్యక్తికి ప్రజలు 11 స్థానాలు కట్టబెట్టారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అది ఇప్పటికీ తెలుసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించి జగన్కు ప్రతిపక్ష హోదా ఎలా ఇవ్వమంటారు? ఆయనకు చట్టాన్ని ఉల్లంఘించడం బాగా అలవాటు. అందుకే ఆయనపై అన్ని కేసులు ఉన్నాయి. పార్లమెంటు, అసెంబ్లీ రూల్ బుక్లో చాలా స్పష్టంగా 10 శాతం సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఉంది. దాని ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు. అసెంబ్లీలో వైసీపీకి 11వ రో(వరుస) కేటాయించాం. ఆ వరుసలో 11 మంది కూర్చోవచ్చు’ అని లోకేశ్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa