ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు

national |  Suryaa Desk  | Published : Fri, Mar 07, 2025, 07:29 PM

భారత దేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గతేడాది డిసెంబర్ 26వ తేదీన తీవ్ర అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే 92 ఏళ్ల వయసులో చనిపోయిన ఆయనకు అరుదైన గౌరవాన్ని ఇవ్వబోతుంది కర్ణాటక సర్కారు. ముఖ్యంగా బెంగళూరు సిటీ విశ్వవిద్యాలయానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టబోతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని నేరుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యే ప్రకటించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


2024 డిసెంబర్ 26వ తేదీన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో కేంద్ర ప్రభుత్వం నిగంబోధ్ ఘాట్‌లో నిర్వహించింది. దేశ అభ్యున్నతి కోసం ఎన్నో సేవలు అందించిన మన్మోహన్ సింగ్ స్మారక నిర్మాణార్థం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే భూమిని కూడా కేటాయించింది. ముఖ్యంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ ప్రాంగణంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారక నిర్మాణం కోసం కేటాయించిన పక్క ఫ్లాట్‌లోనే సింగ్ స్మారక నిర్మాణం కోసం భూమి ఇచ్చింది.


ఇదంతా ఇలా ఉండగా.. తాజాగా కర్ణాటక ప్రభుత్వం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థం ఆ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయానికి ఆయన పేరును పెట్టబోతుంది. బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేరును త్వరలోనే మన్మోహన్ సింగ్ యూనివర్సిటీగా మార్చబోతున్నట్లు ప్రకటించింది. మాజీ ప్రధాని మరణం తర్వాత దేశంలో ఓ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం ఇదే తొలిసారి.


బెంగళూరు సిటీ యూనివర్సిటీని 2017లో స్థాపించగా.. 2020లో ఓసారి పేరు మార్చారు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో మరోసారి నామకరణం చేయబోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆర్స్ట్ కళాశాల మరియు ప్రభుత్వ ఆర్సీ కళాశాలలను కూడా ఈ విశ్వవిద్యాలయం కింద రాజ్యాంగ కళాశాలలుగా అనుసంధానిస్తామని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. దీంతో కర్ణాటక ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.


మరోవైపు కొన్ని రోజుల క్రితమే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. సింగ్ రచనలకు అంకితం చేయబడిన బెంగళూరు విశ్వవిద్యాలయంలో పరిశోధన మరియు అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయిన ఒక రోజు తర్వాత బెళగావిలో మాట్లాడుతూ.. సింగ్ రచనలను కాపాడుకోవడం చాలా ముఖ్యమని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa