ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లీకైన బీఎడ్ ప్రశ్నపత్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 08, 2025, 12:42 PM

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న బీఎడ్ ప్రశ్నపత్రం లీక్ అయింది. ఈ పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు ఈ ప్రశ్న పత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. గుంటూరు జిల్లాలోని ఓ కళాశాల యాజమాన్యమే ఈ ప్రశ్న పత్రం లీక్ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2.00 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్‌మెంట్ పరీక్షను నిర్వహించారు. అయితే అరగంట ముందే ఈ పరీక్ష పత్రం లీక్ అవడం గమనార్హం. మరోవైపు మార్చి 6వ తేదీ నుంచి బీఎడ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమైనాయి. తొలిరోజే.. ఈ ప్రశ్న పత్రం లీక్ అయిందని విమర్శలు వెల్లువెత్తాయి.ఇంకోవైపు ఈ పరీక్షల నిర్వహణపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉన్నతాధికారులను వివరణ కోరగా.. ఈ అంశంపై తమకు ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. ఇక గతంలో యూనివర్శిటీ తరపున ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్‌కు పంపించి అక్కడి నుంచి పరీక్షా కేంద్రాలకు తరలించేవారు. కానీ ఈ సారి మాత్రం ప్రశ్నాపత్రాలను కాలేజీలకు సీడీల్లో పంపించారు. అరగంట ముందు సీడీ పాస్ వార్డ్‌లు యాజమాన్యాలకు పంపిస్తున్నారు. దీంతో ప్రశ్నపత్రాల విషయంలో పోలీసుల పర్యవేక్షణ లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి. యాజమాన్యాలకు పాస్ వార్డ్ రాగానే ప్రశ్న పత్రాన్ని విద్యార్థులకు పంపిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa