అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఓ స్పెషల్ ఆఫర్ ఇస్తూ.. వారి మనసులోని మాటలను తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించే అవకాశాన్ని కల్పించారు. ఈ విషయాన్ని ఆయనే నేరుగా ఎక్స్ వేదికగా వెల్లడిస్తూ.. దేశంలో ఉన్న మహిళల అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈక్రమంలోనే పలువురు మహిళా ప్రముఖులు ప్రధాని ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తికి నమస్కరిస్తున్నానంటూ ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ మహిళల సాధికారత కోసమే కృషి చేస్తుందని.. తమ పథకాలు, కార్యక్రమాల్లో అది ప్రతిబింబిస్తుందని వివరించారు. తాను ముందుగా చెప్పినట్లుగానే ఈరోజు తన సోషల్ మీడియా ఖాతాలను విభిన్న రంగాల్లో తమదైన ముద్ర వేసుకున్న మహిళలు స్వాధీనం చేసుకుంటారని.. తమ మనసులోని భావాలను వెల్లడిస్తారని వివరించారు.
ప్రధాని ఇలా ప్రకటించిన కాసేపటికే.. ఇస్రోకు చెందిన శిల్ప, ఎలీనాలు పోస్టు పెట్టారు. దేశానికి ఎన్నో సేవలు అందిస్తున్న తమలాంటి వాళ్లను కూడా గుర్తించడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వివిధ రంగాల్లో కష్టపడి పని చేస్తూ ఇటు దేశానికి, ప్రజలకు సేవ చేస్తున్న మహిళలు పోస్టులు పెడుతున్నారు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెబుతూనే.. తాము చేసిన, చేస్తున్న పనుల గురించి వివరిస్తున్నారు.
తాజాగా చెస్ ఛాంపియన్ వైశాలి దీనిపై స్పందిస్తూ.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రధాని సోషల్ మీడియా ఖాతాను తాను హ్యాండిల్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుందని వివరించింది. అంతేకాకండా అనేక టోర్నమెంట్లలో భారతదేశం తరఫున చెస్ ఆడతున్నందుకు తాను చాలా గర్వపడుతున్నానని పేర్కొంది.
ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం చాలా బాగుందని.. మహిళలు దేశానికి చేస్తున్న సేవలను ఈరకంగా ప్రజలంతా గుర్తించే అవకాశం కల్పించడం నిజంగా స్ఫూర్తిదాయం అంటూ అనేక మంది కామెంట్లు చేస్తున్నారు. దేశంలో ఉన్న ప్రతీ మహిళకు సెల్యూట్ చేస్తున్నామని వివరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa