ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేముందు ఒక్కసారి ఆలోచించండి

international |  Suryaa Desk  | Published : Sat, Mar 08, 2025, 07:55 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న, వస్తున్న విదేశీయుల గురించి.. వారి వల్ల తమ దేశానికి ఏదైనా ముప్పు వాటిల్లుతుందా లేదా అనేది కూడా అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇకపై యూఎస్ వీసా, గ్రీన్‌కార్డు, సిటిజెన్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతీ ఒక్కరూ వారి సోషల్ మీడియా ఖాతాల వివరాలను కూడా అక్కడి అధికారులతో పంచుకోవాల్సి ఉంటుంది. ఈ వియషయాన్ని నేరుగా అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


అమెరికా వీసా, గ్రీన్‌కార్డు, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులు ఇమ్మిగ్రేషన్ దరఖస్తులతో పాటు తమ సోషల్ మీడియా ఖాతాలను కూడా అందజేయాల్సి ఉంటుందని యూఎస్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ మార్చి 5వ తేదీన ఓ నోటీసులో వెల్లడించింది. ప్రతీ ఏటా 35 లక్షల మందికి పైగా ఈ దరఖాస్తులు చేసుకుంటుండగా.. వారందరి వద్ద నుంచి ఈ సమాచారాన్ని కోరుబోతున్నట్లు డీహెచ్ఎస్ ప్రకటించింది. ఇమ్మిగ్రేషన్ స్క్రీనింగ్‌ను కట్టుదిట్టం చేయాలన్న ఉద్దేశంతో ట్రంప్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో ఈ ప్రతిపాదన ఉంది.


అయితే ఈ కొత్త నిబంధనల మేరకు దరఖాస్తుదారులు 9 ప్రధాన ఇమ్మిగ్రేషన్ ఫారాలతో పాటు తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలను కూడా అమెరికా సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌కు అందజేయాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్ చెప్పాల్సిన అవసరం ఏమీ లేకపోయినప్పటికీ.. ఈ సమాచారాన్ని దదరఖాస్తుల గుర్తింపు కోసం వాడబోతున్నారు. ముఖ్యంగా జాతీయ భద్రతా ముప్పును అంచనా వేసేందుకు వీటిని ఉపయోగించనున్నారు. కాబట్టి ఇకపై అమెరికా వీసా, గ్రీన్‌కార్డు పొందాలనుకునే వాళ్లు పోస్టులు పెట్టేముందు కాస్త ఆచితూచి జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది.


కేవలం పోస్టులు పెట్టడం మాత్రమే కాదండోయ్.. వాటి ద్వారా మాట్లాడే ఫోన్లను కూడా అమెరికా అధికారులు సమీక్షించబోతున్నారు. కాబట్టి దేశాలను తిడుతూ, ముప్పు కల్గించే విధంగా మాట్లాడినా, సందేశాలు పంపినా ఇక జన్మలో మీరు యూఎస్ వీసా, పౌరసత్వం, గ్రీన్‌కార్డులను పొందలేరని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే సోషల్ మీడియాను వాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని వివరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa