ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుసగా 15వ సారి టాస్ ఓడిపోయిన భారత్.. ఫైనల్‌లో ఫస్టు బ్యాటింగ్ ఎవరిదంటే

sports |  Suryaa Desk  | Published : Sun, Mar 09, 2025, 07:57 PM

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత్ తొలుత బౌలింగ్‌ చేయనుంది. ఈ మ్యాచ్‌లోనూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్‌ తొలుత బ్యాటింగ్ చేయనుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్ ద్వారా వరుసగా 15వ వన్డే మ్యాచ్‌లో టాస్ ఓడిపోయాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ నుంచి టీమిండియా వన్డేల్లో ఒక్కసారి కూడా టాస్ గెలవకపోవడం గమనార్హం.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్‌ తొలుత బ్యాటింగ్ చేయనున్నట్లు చెప్పాడు. పిచ్‌ స్వభావాన్ని బట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు వెల్లడించాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో గాయపడ్డ కివీస్ స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని శాంట్నర్ టాస్ సందర్భంగా తెలిపాడు. మ్యాట్ హెన్రీ స్థానంలో తుది జట్టులోకి నాథన్ స్మిత్‌ను తీసుకున్నట్లు చెప్పాడు.


ఇక భారత్ ఈ మ్యాచ్‌కు ఎలాంటి మార్పుల్లేకుండానే బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఆడిన తుది జట్టుతోనే ఆడడనున్నట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు. కాగా ఈ టోర్నీలో లీగ్ దశలో భారత్‌, కివీస్ జట్లు తలపడ్డాయి. అందులో భారత జట్టు విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్‌లోనూ అతడు మ్యాజిక్ చేయాలని భారత్‌ కోరుకుంటోంది.


తుది జట్లు..


భారత్:


రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్‌, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్‌, అక్షర్ పటేల్‌, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్‌దీప్ యాదవ్‌, వరుణ్ చక్రవర్తి


న్యూజిలాండ్‌:


విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డేరిల్ మిచెల్, టామ్ లేథమ్ (వికెట్ కీపర్‌), గ్లెన్ ఫిలిప్స్‌, మైకెల్ బ్రేస్‌వెల్‌, మిచెల్ శాంట్నర్‌ (కెప్టెన్), కైల్ జెమీసన్, విలియమ్ ఓరూర్కే, నాథన్ స్మి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa