ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిటైర్మెంట్ వార్తలపై జడ్డూ భాయ్ క్లారిటీ.. ‘థాంక్స్‌’ అంటూ

sports |  Suryaa Desk  | Published : Mon, Mar 10, 2025, 11:51 PM

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత టీమిండియా సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు రిటైర్మెంట్ ప్రకటిస్తారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గతేడాది భారత్ టీ20 ప్రపంచ కప్ సాధించిన తర్వాత ఈ ముగ్గురూ టీ20లకు వీడ్కోలు పలికారు. దీంతో భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సాధిస్తే ఈ ముగ్గురు వన్డేలకూ రిటెర్మెంట్ ప్రకటిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ భారత్ టైటిల్ సాధించాక.. అటువంటి ప్రకటనేమీ వెలువడకపోవడంతో అభిమానులు ఫుల్ కుషీలో ఉన్నారు.


ఇక తన రిటైర్మెంట్‌ ఊహాగానాలపై రోహిత్ శర్మ ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు. ఫైనల్ మ్యాచ్ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. తాను ఇప్పట్లో రిటైర్‌ కానని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌ నుంచి తాను ఇప్పట్లో తప్పుకోనని స్పష్టం చేశాడు.


కాగా ఫైనల్‌ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా చేసిన పని ఒకటి.. రిటైర్మెంట్ ఊహాగానాలను పెంచేసింది. తన కోటా ఓవర్లు పూర్తికాగానే జడేజాను.. కోహ్లీ పరుగెత్తుకుంటూ వెళ్లి హగ్ చేసుకున్నాడు. దీంతో జడేజా వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతాడనే ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన జడ్డూ.. ఈ తరహా రూమర్స్ క్రియేట్ చేయొద్దని కోరాడు. “రిటైర్మెంట్‌పై అనవసరపు రూమర్స్‌ వద్దు.. థాంక్స్” అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టాడు. తన పోస్టు ద్వారా రవీంద్ర జడేజా.. రిటైర్మెంట్ ఊహాగానాలకు తెరదించాడు. తాను మరింత కాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతానని చెప్పకనే చెప్పేశాడు.


కాగా రవీంద్ర జడేజా.. ఛాంపియన్స్ ట్రోఫీ 2013 సాధించిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2025 విన్నింగ్‌ టీమ్‌లోనూ ఉన్నాడు. న్యూజిలాండ్‌తో ఫైనల్‌లో 10 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ విన్నింగ్‌ షాట్ కొట్టాడు. అంతేకాకుండా ఫైనల్‌లో సూపర్ ఫీల్డింగ్‌తో అదరగొట్టి బెస్ట్ ఫీల్డర్‌ మెడల్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో అతడు సీఎస్కే తరఫున ఆడనున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa