ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రైవేటు డెయిరీలకి ప్రభుత్వం వంతపాడుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 11, 2025, 09:11 AM

రాష్ట్రంలో పాడి పరిశ్రమను ప్రైవేటు డెయిరీలు భ్రష్టుపట్టిస్తున్న కూటమి సర్కార్ చేష్టలూడి చూస్తోందని వైయస్ఆర్‌సీపీ డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. శ్రీకాకుళం వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పాల ధరలు పతనమై పాడి రైతులు ఆక్రందనలు పెడుతున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు డెయిరీల దోపిడీకి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని ధ్వజమెత్తారు.అయన మాట్లాడుతూ.... రాష్ట్రంలో పాడిపరిశ్రమపై ఆధారపడి రైతుల పరిస్థితి ధైన్యంగా మారింది. ప్రభుత్వం నుంచి చేయూత లేకపోవడం, ప్రైవేటు డెయిరీలపై నియంత్రణను పక్కనపెట్టడంతో పాల రైతులు తీవ్రం సంక్షోభంలో చిక్కుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా పాడిరైతులు జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వానికి వంతపాడే పత్రికలోనూ పాడి రైతుల కష్టాలపై కథనాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వంలో ప్రైవేటు డెయిరీలు పాడి రైతులను దోచుకుంటున్నాయి. పాలధరలను తగ్గించడం, ఫ్యాట్ శాతం తక్కువగా ఉందని చెప్పడం ద్వారా రైతులను దగాచేస్తున్నాయి. ఏపీడీడీసిఎఫ్ సెంటర్ల ద్వారా ఏర్పాటు చేసిన మహిళా డెయిరీ డెవలప్‌మెంట్ సెంటర్ల ద్వారా అమూల్‌కు పాలు విక్రయించడానికి వీలులేదని వత్తిడి చేస్తున్నారు. ప్రైవేటు డెయిరీలను పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా ప్రైవేటు డెయిరీలు నిర్ణయించిన తక్కువ రేటుకే పాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa