ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ హోటల్ గదిలో డాక్టర్‌తో ఎన్ఆర్ఐ మహిళ.. ఆ తరువాత ఆత్మహత్య

Crime |  Suryaa Desk  | Published : Tue, Mar 11, 2025, 11:24 PM

విశాఖపట్నం హోటల్ గదిలో మహిళ మృతి చెందిన ఘటనలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ముందు నుంచి అనుమానిస్తున్నట్లుగానే ఈ కేసులో డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను స్థానిక సీఐ వివరించారు.. విశాఖపట్నం కృష్ణానగర్‌కు చెందిన పిల్లా శ్రీధర్‌ అమెరికాలో మెడిసిన్‌ ఫ్యాకల్టీ ఫ్రీలాన్సర్‌గా పని చేస్తున్నాడు. అతడికి అమెరికాలోనే స్థిరపడిన విశాఖపట్నంకు చెందిన మహిళతో పరిచయం అయ్యింది. డాక్టర్ శ్రీధర్ నెల రోజుల క్రితం అమెరికా నుంచి విశాఖపట్నం రాగా.. గత నెల 14న ఆ మహిళ కూడా యూఎస్ నుంచి విశాఖపట్నం చేరుకున్నారు.


డాక్టర్ శ్రీధర్ విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఓ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకుని.. తనను కలవాలంటూ నగరానికి వచ్చిన ఆ మహిళను ఒత్తిడి చేశాడు. ఈ నెల 6న ఆమె హోటల్ గదికి వెళ్లగా.. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మహిళ కోపంతో బాత్రూంలోకి వెళ్లి ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి శ్రీధర్‌ ప్రేరేపించాడనే ఆరోపణలతో కేసు నమోదు చేశామని.. డాక్టర్‌ను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు చెప్పారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. డాక్టర్‌ను కస్టడీకి తీసుకుని మరింత సమాచారం రాబట్టాల్సి ఉందంటున్నారు పోలీసులు.


డాక్టర్‌ శ్రీధర్‌ బ్లాక్‌ మెయిల్‌ చేస్తే మహిళ హోటల్‌ గదికి వచ్చారా.. ఇద్దరి మధ్య పరిచయంతోనే వచ్చారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమెతో ప్రైవేట్‌గా ఉన్న సమయంలో డాక్టర్ శ్రీధర్ వీడియోలు తీశాడని.. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.. దీనిపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. పోలీసులు ముందు మహిళది ఆత్మహత్యగా గుర్తించారు.. కానీ తర్వాత అనుమానాస్పద మరణంగా భావించారు.. అయితే చివరికి వైద్యుడు శ్రీధర్‌ వల్లే ఎన్‌ఆర్‌ఐ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. శ్రీధర్‌ నుంచి మరింత సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు.. ఆయన నోరు విప్పితే కానీ మరిన్ని వివరాలు తెలియవంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa