మహిళల ప్రీమియర్ లీగ్ 2025లో లీగ్ స్టేజ్ ముగిసింది. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య చివరి లీగ్ స్టేజ్ మ్యాచ్ జరిగింది. ఈ లీగ్లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆర్సీబీ.. పోతూ పోతూ.. ముంబై ఫైనల్ బెర్తు అవకాశాలను దెబ్బకొట్టింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో ముంబైని 11 పరుగుల తేడాతో ఓడించి.. ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరకుండా అడ్డుకుంది. దీంతో టేబుల్ టాపర్గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. నేరుగా డబ్ల్యూపీఎల్ ఫైనల్కు చేరుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి.
మంగళవారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. బ్యాటర్లంతా సమష్టిగా సత్తాచాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 రన్స్ స్కోరు చేసింది. స్మృతి మంధాన 37 బంతుల్లో 53 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచింది. ఎలీసా పెర్రీ (49), రిచా ఘోష్ (36)లు రాణించారు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ చివరి ఓవర్ వరకూ పోరాడింది. వన్డౌన్ బ్యాటర్ న్యాట్ సీవియర్ బ్రంట్ (35 బంతుల్లో 69 రన్స్) గొప్పగా పోరాడింది. అయితే ఇతర బ్యాటర్లు ఆమెకు సహకరించకపోవడంతో ముంబై.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులకు పరిమితం అయింది. 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
కాగా ఈ టోర్నీలో ఆడిన తొలి రెండు మ్యాచ్లలో విజయాలు సాధించిన ఆర్సీబీ.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్లలో ఓడి ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. అయితే ఈ మ్యాచ్లో ముంబైని ఓడించి.. ఆ జట్టు నేరుగా ఫైనల్ చేరకుండా అడ్డుకుంది. టేబుల్ టాపర్గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్ చేరింది. మార్చి 13న ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు మార్చి 15న ఢిల్లీ క్యాపిటల్స్తో ఫైనల్లో తలపడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa