డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించాం అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అయన మాట్లాడుతూ..... చంద్రగిరి నియోజకవర్గంలో ఓ తల్లి పాదయాత్ర సమయంలో తమ గోడు వినిపిస్తూ, గంజాయికి బానిస చేసి తన కూతుర్ని శారీరకంగా వాడుకున్నారని చెప్పింది. ఆరోజు ఎస్పీ గంజాయి లేదన్నారు, అదే సమయంలో ఒక స్కూలులో గంజాయి దొరికింది. డ్రగ్స్ వద్దు పేరుతో క్యాంపెయిన్ సీరియస్ గా. పాఠశాలల్లో కమిటీలు కూడా ఏర్పాటు చేస్తాం.హోంమంత్రి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ డ్రగ్స్ ఫుల్స్టాప్ పెట్టేందుకు చర్యలు చేపడుతోంది. పాఠశాలల్లో సైన్స్ ఫేర్, కల్చరల్ ఫేర్, యాన్యువల్ డే నిర్వహిస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి గ్రీన్ పాస్ పోస్టు విధానం అమలుచేస్తాం. అసెంబ్లీ స్పీకర్, అధికారులు అనుమతిస్తే అమరావతిలోనే స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహించాలని భావిస్తున్నాం. ప్రతి నియోజకవర్గం నుంచి ఇక్కడకు పిల్లలను రప్పించి, ప్రజాసమస్యలపై జరిగే చర్చల్లో అవగాహన కల్పించాలని భావిస్తున్నాం. దీనికి ముఖ్యమంత్రిని కూడా రప్పించాలని అనుకుంటున్నాం. స్పెషల్ నీడ్స్ పిల్లలను ఆదుకునేందుకు కమిటీ వేస్తాం. ప్రతి మోడల్ ప్రైమరీ, హైస్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటుచేస్తాం అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa