జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక దుకాణంలో జరిగిన అనూహ్య చోరీ సంఘటన సర్చనీయాంశం అయింది. ఈ సంఘటనలో ఆరుగురు మహిళల గుంపు రూ.12 లక్షల విలువైన చీరలను చోరీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరుకు చెందిన అంజనాదేవి అనే మహిళ 'అను సిక్స్ యార్డ్స్' అనే బొటిక్ను కొండాపూర్లో నిర్వహిస్తుంది. ఆమె రూపొందించిన కస్టమైజ్డ్ దుస్తులు, చీరలు నగరంలో ప్రత్యేకంగా ప్రదర్శన చేయబడతాయి.
ఈ ప్రత్యేక ప్రదర్శనను జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 44లోని ధారా కేఫ్ అండ్ బిస్ట్రోలో నిర్వహించారు. ఎప్పటిలాగే వచ్చిన వారికి ఈ చీరలను చూపించారు. కావాల్సిన వారు కొనుక్కొని వెళ్లారు. ఇష్టం లేని వారు అక్కడ నుంచి ఆ ప్రదర్శనను తిలకించి వెళ్లిపోయారు. అక్కడకు ఆరుగురు కలిసి ఓ మహిళా గుంపు వచ్చారు. ఆ చీరలను కొంటున్నట్లు నటించారు. ఒకొక్కటి సెలెక్ట్ చేస్తూ.. ఆ ప్రదర్శన అంతా తిలకించారు. సమయం చూసి.. అక్కడ నుంచి డబ్బులు చెల్లించకుండా ఉడాయించారు.
అయితే ఈ కార్యక్రమం ముగిసిన తరువాత.. కేఫ్ లో ఉన్న ఖరీదైన ఏడు చీరలు కనిపించలేదు. ప్రదర్శన నిర్వహించిన మూడు రోజుల తర్వాత వారు చీరలను లెక్కిస్తుంటూ కౌంట్ తప్పుగా వచ్చింది. ఈ సంఘటన గురించి అంజనాదేవి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ కేప్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత.. ఆరుగురు మహిళలు చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
వారు చోరీ చేసినప్పుడు ప్రదర్శన నిర్వహించబడుతోంది. అప్పుడు దానిని ఎవరూ గ్రహించలేదు. తర్వాత అలర్ట్ అయిన బొటిక్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన భయటపడింది. పోలీసులు ఈ చోరీ కేసును సీరియస్గా తీసుకుని, చోరీకి పాల్పడిన మహిళలను వెంటనే పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన నగరంలో తీవ్ర ప్రకంపనలను సృష్టించింది. దుకాణాలు, ప్రదర్శనలు నిర్వహించేవారికి మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జూబ్లీహిల్స్ పోలీసులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa