గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లించాల్సిన రూ.4,271 కోట్లు బకాయిలు పెట్టి పోతే.. తమ ప్రభుత్వం వాటిని చెల్లిస్తోందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. దశలవారీగా బకాయిలు చెల్లిస్తున్నామని, ఇది నిరంతరం సాగే ప్రక్రియ అని పేర్కొన్నారు. కొత్త రీయింబర్స్మెంట్ విధానంలో ఏప్రిల్ 24 తర్వాత నేరుగా కాలేజీల అకౌంట్లలోనే మిగిలిన నిధులు జమ చేస్తామని తెలిపారు. కొన్ని కాలేజీల యాజమాన్యాలు కావాలనే విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యారంగంలో సంస్కరణలపై బుధవారం శాసనమండలిలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరిస్తామని చెప్పారు. విద్యా శాఖ తనకు భారం కాదని, తానే కావాలని బాధ్యతగా తీసుకున్నానని తెలిపారు. ‘‘సమాజంలో అసమానతలు పోవాలంటే విద్యతోనే సాధ్యం. గత వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో వాస్తవాలకు దూరంగా పని చేసి విద్యా ప్రమాణాలను దిగజార్చింది. సీబీఎ్సఈ విధానంపై ఎలాంటి కసరత్తు చేయలేదు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకుండా, విద్యార్థులను సన్నద్ధం చేయకుండానే రాష్ట్రవ్యాప్తంగా 1000 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎ్సఈ సిలబ్సను ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాఠశాలల్లోని విద్యార్థులకు మాక్ టెస్ట్ నిర్వహిస్తే 90 శాతం మంది ఒక సబ్జెక్ట్లో ఫెయిలయ్యారు. అందుకే సీబీఎ్సఈని తాత్కాలికంగా వాయిదా వేశాం. విద్యారంగంలో దశల వారీగా సంస్కరణలు అమలుచేస్తాం. గత ప్రభుత్వంలో మాదిరిగా రాజకీయ పార్టీల రంగులు, ఫొటోలు లేకుండా విద్యార్థులకు ఇచ్చే స్కూల్ కిట్లను సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో అందజేస్తున్నాం. ప్రచార పిచ్చితో ఫొటోలు, రంగులకు గత ప్రభుత్వం చేసిన వృథా ఖర్చులు రూ.1000కోట్ల వరకు తగ్గించాం’’ అని లోకేశ్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa