ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూరల్‌ ప్రాంతాల్లో కూడా 63 క్యాంటీన్ల ఏర్పాటుకు సన్నాహాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 13, 2025, 11:47 AM

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ 135 లీటర్ల తాగునీరు అందిస్తామని, దీనిని మూడేళ్లలో పూర్తిచేస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ అన్నారు. బుధవారం అసెంబ్లీలో మున్సిపల్‌ బడ్జెట్‌ ఆమోదానికి జరిగిన చర్చ అనంతరం ఆయన సమాధానం ఇచ్చారు. గ్రామాల నుంచి ప్రజలు వలస రావడం వల్లే పట్టణాల్లో జనాభా పెరుగుతోందని, మున్సిపాలిటీల్లో 1.50కోట్ల మంది ప్రజలు ఉన్నారని వివరించారు. గత ప్రభుత్వం సీఎ్‌ఫఎంఎ్‌సలో మున్సిపాలిటీలకు చెందిన నిధులు తిరిగి వాటికి ఇవ్వలేదని తెలిపారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, ఏప్రిల్‌ 1నుంచి మున్సిపాలిటీల నిధులు వారే ఖర్చు చేసుకునేందుకు ఆమోదించారని చెప్పారు. మున్సిపల్‌ శాఖకు బడ్జెట్‌లో రూ.13,862 కోట్లు కేటాయించారని తెలిపారు. అమృత్‌ 2.0 పథకానికి కేంద్రం దాదాపు రూ.8,500 కోట్లకు అనుమతిచ్చిందని, అందులో 36.7 శాతం నిధులు కేంద్రమే ఇస్తుందని వివరించారు. గత ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వపోవడం వల్ల ఆ ప్రాజెక్టు నిలిచిపోయిందని మంత్రి ఆరోపించారు. దాన్ని పూర్తి చేయడానికి బడ్జెట్‌లో రూ.756 కోట్లు కేటాయించారని తెలిపారు. 360, 430 చదరపు అడుగుల గృహాలను జూన్‌ నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. 2014-19మధ్యకాలంలో ప్రారంభించిన 204 అన్నక్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసేసిందన్నారు. ప్రస్తుతం మళ్లీ 199అన్నక్యాంటీన్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రూరల్‌ ప్రాంతాల్లో 63 క్యాంటీన్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించామని, వంద రోజుల్లో వాటిని ప్రారంభిస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు అశోక్‌ రెడ్డి, గణబాబు మాట్లాడుతూ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు. అమృత్‌ 2.0 పథకం కింద నీటి సరఫరా నిలిచిపోయిందని, త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే పుల్లరావు కోరారు. జీవీఎంసీలో కమిషనర్‌ను నియమించాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa